Thursday, 25 June 2026 08:05:46 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 24 June 2026 08:16 PM Views : 66

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధార్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, సమాజంలో శాంతి. ధార్మిక కార్యక్రమాలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పరిధిలోని సాయిబాబా దేవాలయం 16వ వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. అక్కడ జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను తిలకించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి దైవచింతన ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం వంటి గొప్ప సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ గుర్తించి పేదలను ఆదుకోవడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, పరుచూరి కృష్ణ మోహన్, రాంబాబు, నాగేశ్వర్ రావు, వాసిరెడ్డి ప్రసాద్, ఏపూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: