తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధార్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, సమాజంలో శాంతి. ధార్మిక కార్యక్రమాలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పరిధిలోని సాయిబాబా దేవాలయం 16వ వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. అక్కడ జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను తిలకించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి దైవచింతన ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం వంటి గొప్ప సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ గుర్తించి పేదలను ఆదుకోవడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, పరుచూరి కృష్ణ మోహన్, రాంబాబు, నాగేశ్వర్ రావు, వాసిరెడ్డి ప్రసాద్, ఏపూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ