తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 15తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం గంగారాం తండా కు చెందిన రైతు ఆంగోత్ కృష్ణ తోటలో పాటు నిమిత్తం పొలానికి ఎడ్లను తీసుకొని వెళ్లగా వ్యవసాయ పొలంలో ఉన్న త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను ఎద్దు తలిగి అక్కడికక్కడే మృతి చెందింది దీంతో సదరు బాధిత రైతు ఎద్దు మృతితో రూ.1లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. మంచి పాటుల టైం లో ఎద్దు చనిపోవడం తో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సబ్స్టేషన్ ఏ ఇ k నరసింహారావు, లైన్మెన్ భాస్కరరావు, లైన్మెన్ వినోద్ సంఘటనా స్థలానికి చేరుకొని జూలూరుపాడు పశు వైద్యాధికారి చే పంచునామా నిర్వహించి సదరు బాధిత రైతుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తామని వెల్లడించారు
Admin
తెలుగు వెలుగు టీవీ