Thursday, 25 June 2026 08:07:53 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 21 June 2026 07:28 PM Views : 251

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.ప్రత్యేక ప్రార్థనలతో సమాజంలో శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయి.మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు నిలుస్తాయి.పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి.ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగను జరుపుకోవాలి.ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుంది.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.పాతకొత్తగూడెంలోని హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ కనాను సందర్శించిన సాబీర్ పాషా. మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనమని, ఈ పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ చాటిచెప్పాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ నెల 26న జరగనున్న మొహరం పండుగను పురస్కరించుకుని జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆదివారం పాతకొత్తగూడెంలోని హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ కనాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ... మొహరం పండుగ రోజుల్లో నిర్వహించే ప్రత్యేక పూజల వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయని, లోకకల్యాణం జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ వేడుకలు గంగా-జమునా తెహజీబ్‌కు, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. పవిత్రమైన ఈ రోజుల్లో భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి మానవుడికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, సమాజంలో ఐక్యత పెరుగుతుందని వివరించారు. ఆషూర్ కనా కమిటీ నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో నయీమ్ ఖురేషి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, పడాల భవాని, రామారావు, సాంబిరెడ్డి, ఇమ్రాన్, జమాలుద్దీన్, మొహమ్మద్ అలీ, జడల అరుణ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :