Tuesday, 21 April 2026 08:51:26 PM
# మెరుగైన సేవలు కొరకే ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే జారె. # వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: టిజిఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్ రెడ్డి. # స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి.

Date : 21 April 2026 06:53 PM Views : 36

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ విద్యా సంవత్సరం జరిగిన ప్రగతిని సమీక్షించుకొని స్పష్టమైన ప్రణాళికతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు తో ఈరోజు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సంవత్సరాంత సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నత స్థాయిలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం లో జరిగిన ప్రగతిని మరియు లోటుపాట్లను సమీక్షించుకొని వచ్చే విద్యా సంవత్సరం ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. విద్యాశాఖలో జరిగే వివిధ కార్యక్రమాలైన పాఠశాల వారి విద్యార్థుల నమోదు, మూతబడిన పాఠశాలను తిరిగి తెరిపించడం, అదేవిధంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నమోదులో మార్పు, పిల్లల ఆధార్ మరియు అపార్ పరిస్థితి, ప్రతి పాఠశాల యొక్క మౌలిక వసతుల లభ్యత మొదలగు అంశాలపై ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ వచ్చే విద్యా సంవత్సరానికి ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. అదేవిధంగా పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మరమ్మతులు మరియు నిర్మాణ పనులపై కూడా ఆయా ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో కలిపి సమీక్ష చేశారు. ఈ సంవత్సరం ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నత స్థాయిలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, మండల విద్యాశాఖ అధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలను సందర్శించిన వివరాలు మొదలగు వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి చూపించి ఈ సంవత్సరం ఫలితాలను బేరీజు వేసుకొని వచ్చే సంవత్సరం 100% ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పిల్లలు వేసవి సెలవులలో అభ్యసన ప్రక్రియకు దూరం కాకుండా ఉండటానికి వారికి 45 రోజులు పాటు ఎటువంటి రాత పనిని ఇవ్వాలో దిశా నిర్దేశం చేస్తూ పిల్లలందరూ ఈ రాత పనిలో నిమగ్నం అయ్యే విధముగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దానికై ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని విద్యార్థుల్లో అభ్యసన లోపం లేకుండా చూడాలని కోరారు. వివిధ మండలాల్లో భవిత భవనాల నిర్మాణం లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి పాఠశాలలు పునః ప్రారంభం నాటికి పిల్లలకి అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్ కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, బాలిక విద్యా కోఆర్డినేటర్ జే. అన్నామని, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :