తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ విద్యా సంవత్సరం జరిగిన ప్రగతిని సమీక్షించుకొని స్పష్టమైన ప్రణాళికతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు తో ఈరోజు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సంవత్సరాంత సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నత స్థాయిలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం లో జరిగిన ప్రగతిని మరియు లోటుపాట్లను సమీక్షించుకొని వచ్చే విద్యా సంవత్సరం ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. విద్యాశాఖలో జరిగే వివిధ కార్యక్రమాలైన పాఠశాల వారి విద్యార్థుల నమోదు, మూతబడిన పాఠశాలను తిరిగి తెరిపించడం, అదేవిధంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నమోదులో మార్పు, పిల్లల ఆధార్ మరియు అపార్ పరిస్థితి, ప్రతి పాఠశాల యొక్క మౌలిక వసతుల లభ్యత మొదలగు అంశాలపై ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ వచ్చే విద్యా సంవత్సరానికి ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. అదేవిధంగా పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మరమ్మతులు మరియు నిర్మాణ పనులపై కూడా ఆయా ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో కలిపి సమీక్ష చేశారు. ఈ సంవత్సరం ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నత స్థాయిలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, మండల విద్యాశాఖ అధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలను సందర్శించిన వివరాలు మొదలగు వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి చూపించి ఈ సంవత్సరం ఫలితాలను బేరీజు వేసుకొని వచ్చే సంవత్సరం 100% ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పిల్లలు వేసవి సెలవులలో అభ్యసన ప్రక్రియకు దూరం కాకుండా ఉండటానికి వారికి 45 రోజులు పాటు ఎటువంటి రాత పనిని ఇవ్వాలో దిశా నిర్దేశం చేస్తూ పిల్లలందరూ ఈ రాత పనిలో నిమగ్నం అయ్యే విధముగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దానికై ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని విద్యార్థుల్లో అభ్యసన లోపం లేకుండా చూడాలని కోరారు. వివిధ మండలాల్లో భవిత భవనాల నిర్మాణం లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి పాఠశాలలు పునః ప్రారంభం నాటికి పిల్లలకి అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్ కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, బాలిక విద్యా కోఆర్డినేటర్ జే. అన్నామని, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ