తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 29 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అన్నారపాడు గ్రామంలో జరిగినది వివరాల్లోకి వెళితే ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో అన్నారు పాడు గ్రామంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంపై జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాధావతు రవి తన సిబ్బందితో కలిసి అచ్చటకు వెళ్లి మెరుపు దాడి చేసి ఎనిమిది మంది వ్యక్తులు అనగా గుగులోతు భాస్కర్ బాదావత్ బాలాజీ, బానోతు వీరు, గుగులోతు గోపాల్, లౌడియా కిషన్ బాదావత్ బిక్షం బాదావత్ నవీన్ బాదావత్ పటేల్ అను వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 5100 రూపాయల నగదు మరియు మూడు ద్విచక్ర వాహనాలను పంచుల సమక్షంలో స్వాధీన పరుచుకొని పేకాట ఆడుతూ పట్టుబడిన సదరు ఎనిమిది మందిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయనైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ