తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : మండలంలోని గరీబ్ పేట పంచాయతీలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొని, ప్రారంభించినారు లబ్ధిదారులు కట్టబోయిన రజిత - సతీష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతు పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా స్థిరమైన నివాసం కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల సహకారంతో ప్రతీ అర్హత కలిగిన పేద కుటుంబానికి ఇల్లు ఇప్పించేలా కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, గరీబ్ పేట సర్పంచ్ కూసం దివ్యతేజ,ఉప సర్పంచ్ రెడ్డిబోయిన వెంకన్న,మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ కరీంపాషా,ఓబీసీ మండల అధ్యక్షులు కసనబోయిన లక్ష్మణ్,విద్యాకమిటీ చైర్మన్ కట్టెబోయిన లింగమల్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మనబోయిన సైదులు, తిరుపతి యాదవ్ యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోతు కోటేష్, సాయిచంద్ మరియు నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ