తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : చుంచుపల్లి మండలం రాంపురం గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములు నుంచి అనుమతులు లేకుండా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో మట్టిని తరలించడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ము కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా గ్రామ రోడ్లు కూడా దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ