తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బహుజన మేధావుల చేతుల మీదుగా బీపి మండల్ అవార్డు ప్రధానం బీసీ బంధావుడు, గోకులకృష్ణ ట్రస్ట్ చైర్మన్ గా ఎందరో బీసీ బిడ్డలకు అండగా నిలిచిన భద్రాద్రి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతా రాములుకు ప్రతిష్ఠాత్మక బీపి మండల్ అవార్డు లభించింది. బహుజన అభివృద్ధి దిశగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి మరియు ఉద్య ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏప్రిల్ 13 నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో బడుగుల నాగార్జున యాదవ్, మేకల లలితా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనాగా సీతారాములుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందించారు. బీసీల పితామహుడిగా గుర్తింపు పొందిన బిందెశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థంగా బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్న నాగా సీతారాములుకు ఈ అవార్డు అందచేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవ, బహుజనుల అభ్యున్నతి, యువతలో చైతన్యం కల్పించడం వంటి విభిన్న రంగాల్లో నాగా సీతారాములు గత కొన్ని సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం గర్వకారణమని స్థానిక ప్రజలు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ