తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు పిలుపునిస్తాం- మిరియాల రంగయ్య సోమవారం ఉదయం శేషగిరిభవన్ లో గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశం లో అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా మాట్లాడుతూ పెండింగ్ లో చాలాకాలంగా ఉన్న డిపెండెంట్ లకు ఉద్యోగ నియామకాల పత్రాలు వెంటనే జారీ చేయాలని అన్నారు,అదేవిధంగా మెడికల్ బోర్డు పెట్టకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుంది అని మండిపడ్డారు,మరియు రీజియన్ లో ఉన్న వికే కోల్ మైన్ లో సింగరేణి కార్మికులచే తియ్యాలి అని తెలిపారు,అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని మరియు సి & ఎండి స్థాయి స్టక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ 6న అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ వద్ద నిరసన కార్యక్రమలు,మరియు 8న జీఏం కార్యాలయాల వద్ద భారీ ధర్నాలు కార్యక్రమాలు విజయవంతం చెయ్యాలని కార్మికులను కోరారు,అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చి ప్రతి కార్మికుడికి 200వందల గజలస్థలం తో పాటు 30లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు,డిస్మిస్ అయిన ఉద్యోగులకు మళ్లీ ఒక అవకాశంగా ఉద్యోగులు కల్పించాలని,మరియు సింగరేణి యాజమాన్యం ఇచ్చిన 150 మాస్టర్లు చెయ్యాలని నిబంధన సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా ఎఐటియుసి గుర్తింపు సంఘంగా గెలిచిన దగ్గరనుండి కార్మికుల పక్షాన నిలబడి అనేక కార్మికుల సమస్యలు పరిష్కరించం అని రానున్నరోజుల్లో కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కావున కార్మికులు గమనించాలని అన్నారు,ఈ కార్యక్రమం లో కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు,కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి ప్రెసిడెంట్ క్రిస్టోఫర్,సహాయ కార్యదర్శి రాము, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, హుమాయూన్, లక్ష్మీనారాయణ,బండారి మల్లయ్య,రాజేశ్వరరావు, నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ