తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మరియు కొత్తగూడెం ప్రాజెక్ట్ ల పరిధిలో పాలకోయతండా మరియు రామవరం -9 అంగన్వాడీ కేంద్రాల కు ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్సార్ యాక్టివిటీస్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , జారుడు బల్లలు, వాటర్ఫిల్టర్లు ఎల్ఈడి టీవీలు , రైస్ కుక్కర్లు, ప్లేట్లు గ్లాసులు ,స్కూల్ బ్యాగులు , వర్క్ బుక్స్ , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు . ఈ కార్యక్రమం మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ , చైర్మన్ హైదరాబాదుకు చెందిన లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది . జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ఎస్బిఐ పాన్ ఇండియా వారు తమ సిఎస్సార్ నిధుల నుండి ఒక్కొక్క కేంద్రానికి లక్ష రూపాయల విలువైన సామగ్రి ని అందించటం అభినందనీయం అన్నారు . వీటి ద్వారా పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని మరియు పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ సిల్ క్యాంపస్ భావ్ సింగ్ ,రుద్రంపూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణ , జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన, సీడీపీఓ లు ప్రసన్న , పద్మశ్రీ కార్పొరేటర్లు శ్యామల , కంచర్ల హిమశ్రీ , అంగన్వాడీ టీచర్లు జ్యోతి , పద్మ , చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ