తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.2.80 కోట్ల విలువ చేసే 1132 కిలోల గంజాయిని శుక్రవారం దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏడబ్ల్యుఎం కన్సటింగ్ లిమిటెడ్ తల్లేడ మండలం గోపాల్పేట్ దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేయించారు. డిస్పోజల్ కమిటీ అధికారి డిప్యూటి కమిషనర్ జి . జనార్థన్రెడ్డి అదేశాల మేరకు భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ పరిధిలోని పది కేసుల్లోని 1132 కిలోల గంజాయిని కాల్చివేతకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు గంజాయిని ద`హనం చేశారు. ఈ గంజాయి దహన కార్యక్రమంలో ఖమ్మం డిప్యూటి కమిషనర్ జి .జనార్థన్రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ జి . గణేష్, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్ సూపరిండెంట్ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీమ్ ఉన్నీషా బేగం సమక్షంలో గంజాయిని దగ్ధం చేయించారు. గంజాయిని ద`హనం చేయించిన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్రెడ్డి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ