తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జూలై 20 ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేధర బస్తి ఎస్ ఆర్ కె టి స్కూల్ లో ఘనంగా ఆషాడ బోనాల. సంబరాలు నిర్వహించడం జరిగింది .చిన్నతనం నుండే విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఉద్దేశంతో మేదర బస్తి ఎస్సార్ కే టి స్కూల్లో చిన్నారులచే దుర్గమ్మ తల్లికి ఆషాడ మాస బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎల్కేజీ ,యూకేజీ మొదలు ప్రీమియం తరగతుల విద్యార్థులు తాము ఆరోగ్యంగా ఉండాలి,చదువులు బాగా రావాలని అమ్మ వారికి బోనమెత్తారు.మట్టి కుండల్లో నైవేద్యాన్ని ఉంచి, పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించారు .ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో అమ్మలను గన్న అమ్మ శ్రీ దుర్గమ్మవారికి బోనాలను సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ హాజరయ్యారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు డైరెక్టర్లు ఘనంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని బొకేతో స్వాగతం పలికి బోనాలు ఎత్తుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు స్కూల్ యజమానులతొ కలిసి బోనాలు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ లలో బోనాల జాతర అత్యంత పవిత్రంగా జరుగుతుందని అదేవిధంగా ఆషాడ మాసం ఊరురా జరుపుకునే సాంప్రదాయ పండుగ బోనాల పండుగ అని అన్నారు. కొత్తగూడెంలో ఎస్ ఆర్ కె టి స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు అని పేర్కొన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని అలాంటి రైతుకు పంటలు బాగా పండి సంతోషంగా జీవించేలా చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి వేషాధారణలో చిన్నారి శాన్వి సహోజ్, నృత్య ప్రదర్శనలో పోతురాజులు ఆకర్షణీయంగా నిలిచారు. నర్సరీ నుండి మొదలుకొని పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు టీచర్లు అందరూ కలిసి సంతోషంగా నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాపు సీతాలక్ష్మిని ఎస్ ఆర్ కే టి ప్రధానోపాధ్యారాలు డైరెక్టర్లు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేధార్ బస్తి ఎస్సార్ కే టి స్కూల్ డైరెక్టర్స్ కోట్ల రామరాజు, గుగులోత్ హతీరామ్, ప్రిన్సిపాల్ స్వర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ