తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 27 (తెలుగు వెలుగు) ; మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఐ ఏ ఎల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐ ఏ ఎల్) నేడు ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చిన సరళి కృత ఆర్థిక విధానాలు భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహనీయుడని ఈ సందర్భంగా వారు కొనియాడారు .ఆర్థిక సంస్కరణతో పాటు అనేక చట్టాలను తీసుకొచ్చిన మహనీయుడు .2005లో గృహం చట్టం ,సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, 2006లో అటవీ హక్కుల చట్టం ,2007లో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ,2008లో అసంఘటిత కార్మిక భద్రత చట్టం ,2009లో పిల్లల ఉచిత విద్య ,నిర్బంధ విద్య ఇలా అనేక చట్టాలను తెచ్చి సమాజ హితం కోసం పనిచేసిన మహా నాయకుడు వారు కొనియాడారు. పనిచేయటమే తప్ప ఎలాంటి అంగు ,ఆర్భాటం, ప్రచారం కోరుకొని ప్రధానిగా ఇవాళ ఇంతటి గుర్తింపు పొందారని అన్నారు .ఆయన చేసిన చట్టాలను బ్రష్టు పట్టించకుండా వాటిని అమలు పరచడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భావిస్తుంది. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ
Admin
తెలుగు వెలుగు టీవీ