Monday, 20 April 2026 01:35:22 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం ఏరియాలో.. ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి మరియు 58 వ ఇంజనీర్స్ డే

Date : 15 September 2025 07:13 PM Views : 458

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయం నందు సివిల్ ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి మరియు 58 వ ఇంజనీర్స్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఏం షాలెం రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలతో వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేడుకలలో పాల్గొన్న ఇంజనీర్ లను, ఇతర అధికారులను ఉద్దేశించి జిఎం మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా నిరాడంబరమైనటువంటి స్థాయి నుంచి ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లలో ఒకరుగా ఎదగడం భారతదేశానికి ఎంతో గర్వకారణం అన్నారు. భారతదేశం యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమని, అదేవిధంగా ప్రస్తుత యువత మోక్షగుండం విశ్వేశ్వరయ్య ని స్ఫూర్తిగా తీసుకొని ఇంజనీరింగ్ లో ప్రగతిని తీసుకురావడానికి తమ వంతు కృషి చేయడానికి పూనుకోవాలన్నారు. ఈనాడు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ ప్రాజెక్టులను చేపట్టడం కోసం పునాదులు వేయడం మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో కూడా సాగిందని చెప్పుకోవచ్చు అని తెలియజేశారు. ప్రతీ ఏడాది ఒకొక్క థీమ్ తో ఈ యొక్క ఇంజనీర్స్ డే చేసుకుంటున్నామని, ఈ ఏడాది “ డీప్ టెక్ & ఇంజనీరింగ్ ఎక్సలెన్స్: డ్రైవింగ్ ఇండియాస్ టెక్డేడ్ ( “Deep Tech & Engineering Excellence: Driving India's Techade.”) అనే థీమ్ తో నిర్వహించుకుంటున్నామని, అదే విధముగా ఇంజనీర్లు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీలను ఉపయోగిస్తూ విలువలతో కూడిన ఇంజనీరింగ్ పని తనం తో నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించి భావి తరాల వారికి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం (ఏ‌ఐ‌టి‌యూ‌సి) బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జున రావు, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ జాయింట్ సెక్రెటరీ ఏ ఉపేంద్ర బాబు, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, ఎజి‌ఎం(సివిల్) సిహెచ్. రామకృష్ణ, ఇంచార్జ్ ఎస్ ఓ టు జి ఎం.వెంకటేశ్వర్లు, డిజి‌ఎం(పర్సనల్)జి.వి మోహన్ రావు, ఇతర వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :