Friday, 19 June 2026 03:00:16 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

రూ.2.76కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 18 June 2026 05:46 PM Views : 144

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆధునికీకరణతో రాతిచెరువు రూపురేఖలు మారుతాయి. ✍️ రూ.2.30కోట్లతో రాతి చెరువు అభివృద్ధిపనులు చేపడుతున్నాం. ✍️ అభివృద్ధికి చిరునామాగా పాల్వంచను తీర్చిదిద్దుతాం. ✍️ నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు. ✍️ ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా నిరంతర కృషి. ✍️ నిర్ణీత కాలంలోగా నాణ్యతతో పనులు ముగించేలా చర్యలు తీసుకుంటాం. ✍️ ప్రతిపల్లెకు, బస్తీకి మౌలిక వసతులు కల్పిస్తాం. ???? కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. రూ.2.30కోట్ల నిధులతో చేపట్టనున్న రాతిచెరువు ఆధునికరణతో చెరువు రూపురేఖలు మారుతాయని, రాతి చెరువు పరిసరాలు ఎంతగానో ఆహ్లాదంగా మారుతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలో రూ.2.30 కోట్లతో చేపట్టనున్న రాతి చెరువు అభివృద్ధి పనులకు, అలాగే రూ.76 లక్షల నిధులతో నిర్మించనున్న రెండు నూతన రోడ్ల నిర్మాణ పనులకు గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ... రూ.2.30 కోట్లతో రాతి చెరువు సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, ఇతర ఆధునీకరణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. అభివృద్ధికి చిరునామాగా పాల్వంచను తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని వివరించారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా తాము నిరంతర కృషి చేస్తున్నామని, నియోజకవర్గ పరిధిలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని నిధులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు ముగించేలా చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రతిపల్లెకు, బస్తీకి మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, తహసిల్దార్ దారా ప్రసాద్, ఇంచార్జీ కమిషనర్ విజయానంద్ ఎలక్ట్రికల్ Ade అబ్దుల్ రెహమాన్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు నామ కీర్తి గొర్లె అన్నపూర్ణ, కాల్వ భాస్కర్, దున్నపోతుల మణి, దంతబోయిన నరేష్, నాయకులు వీ పద్మజ, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, శెనగారపు శ్రీనివాసరావు, SA రెహమాన్, ys గిరి, గౌస్ పాషా, మస్తాన్, అహ్మద్ జానీ, కరీం, గొర్లె నరేష్, నామ పండు, ఆలపాటి ప్రసాద్, అల్లి వెంకటేశ్వర్లు వివిధ శాఖల డి ఈ లు ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: