Saturday, 18 April 2026 06:09:20 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

విద్యను అట్టగుడు వర్గాలకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 21 March 2025 07:10 PM Views : 569

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యను అట్టగుడు వర్గాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేస్తుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యా రంగానికి 15 శాతం నిధులను కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి కేవలం 7.57 శాతం కేటాయించి చేతులు దులుపుకున్నారని,ఇటీవల ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లతో ప్రవేశపెట్టి విద్యారంగానికి కేవలం రూ.23,108 కోట్లు మాత్రమే కేటాయించారని,ఈ అరకొర నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవని విమర్శించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ మ్యానిపెస్టోలో పెట్టిన ప్రతీ మండల కేంద్రానికో హైస్కూల్,జూనియర్ కాలేజీ,ప్రతీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల,ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్ లో పేజీ కళాశాల నిర్మించడం ఏలా సాధ్యమవుతుందో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.మెరుగైన రీతిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇస్తామని హామీని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన 16 నెలల పరిపాలన కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.దాదాపు రూ.8వేల కోట్ల ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ పెండింగ్ లో ఉన్నయని ఇవ్వి విడుదల కాక అనేక మంది విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని,ఆర్థిక భారంతో విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నిధులను విడుదల చేయడానికి ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేయాల్సిన ప్రభుత్వం అసలు వాటి ప్రస్తావన చేయకపోవడం మోసపూరిత విధానానికి నిదర్శనమన్నారు.విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులను కేటాయించాల్సిన ప్రభుత్వం 7.57 శాతం మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని ఏ విధంగా బాగు చేస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ పై ఉందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సాయి, పుణెం మురళి,బాబీ, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :