తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుండి సూపర్ బజార్ మీదుగా బస్ డిపో వరకు అక్కడి నుండి రైల్వే మస్జీద్ వరకు జరిగిన ర్యాలీలో సాబీర్ పాషా తో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి, డీసీసీ మైనారిటీ అధ్యక్షులు మహామూద్ ఖాన్, ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, ఉర్దూఘర్ వైస్ ప్రెసిడెంట్ జుబైర్, అబ్దుల్ రబ్, ఎండీ ఖమర్, అమీర్ ఖాద్రి, కాంగ్రెస్ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, జావీడ్ సటే, యకూబ్, స్యద్ ఫయాజ్యుద్దీన్, జమాల్, గౌస్ భాయ్, ఫరీద్, బాబుజని తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ