Friday, 24 April 2026 03:09:00 PM
# హిందూ సమ్మేళనానికి జిల్లా ఎస్.పి రోహిత్ రాజ్ కి ఆహ్వానం. # కొత్తగూడెం ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత పరిచయ కార్యక్రమం. # పాల్వంచలో లేడీస్ జిమ్ & జుంబా స్టూడియో ఏర్పాటు. ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # సీతారామ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి తిరుగుండదు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె. # క్రీడల్లో గెలుపోటములు సహజం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # మెరుగైన సేవలు కొరకే ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే జారె. # వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: టిజిఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్ రెడ్డి. # స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల.

డి. ఎల్. ఈ డి కళాశాలలో తెలుగు మీడియం (12 బ్యాచ్) రెగ్యులర్ డి. ఎల్. ఇ డి కోర్సులో ప్రవేశ దరఖాస్తులు విడుదల

Date : 22 April 2026 04:40 PM Views : 46

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : 2026-28 విద్యా సంవత్సరమునకు గాను రాష్ట్రంలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం భద్రాచలం ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన డి. ఎల్. ఈ డి కళాశాలలో తెలుగు మీడియం (12 బ్యాచ్) రెగ్యులర్ డి. ఎల్. ఇ డి కోర్సులో ప్రవేశం నిమిత్తం ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థుల నుండి నేరుగా దరఖాస్తులను కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో మొత్తం 50 సీట్లు కలవని, కళాశాలలో ప్రవేశానికి అర్హతలు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతములకు చెందిన గిరిజన అభ్యర్థులై ఉండవలెనని, మే/జూన్ 2026 కానీ అంతకు ముందు కానీ ఇంటర్మీడియట్ పాసై కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలని, సంబంధిత ఇంటర్మీడియట్ పరీక్షలో సాధించిన మెరిట్ ని బట్టి ఎంపిక జరుగుతుందని, ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారము మహిళలకు ప్రత్యేక కేటగిరి వారికే సీట్లు రిజర్వు చేయబడ్డాయని, ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 01. తేదీ 04-08-2014, నెంబర్ 63. తేదీ 28-10-2013, నెంబర్ 22. తేదీ 29-05-2014 మరియు నెంబర్ 10. తేదీ 12-04-2017 ప్రకారం పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కళాశాలలో ప్రవేశానికి ప్రాస్పెక్టస్ మరియు దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, ఏటూరు నాగారం, ఉట్నూర్, మన్ననూరు ఐటిడిఏ కార్యాలయంలలోను మరియు గిరిజన డి ఎల్ ఈ డి కళాశాల భద్రాచలం నందు ప్రోస్పెక్టరేస్ మరియు దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చునని ఆయన అన్నారు. దరఖాస్తు పోస్టు ద్వారా పొందగోరు అభ్యర్థులు తమ సొంత అడ్రస్ గల కవర్ (రు.10/-స్టాంపుతో)ను ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలంకు పంపి పొందవచ్చునని, దరఖాస్తు మరియు ప్రాస్పెక్టస్ క్షుణ్ణంగా చదివి దరఖాస్తుని సక్రమంగా పూర్తి చేసి వచ్చేనెల 11 వ తారీకు వరకు సమర్పించాలని ఆయన కోరుతూ అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరించబడునని అన్నారు. మరిన్ని వివరాలకు 9959575539, 8639084543, 8309972776 ఫోన్ నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :