Sunday, 19 April 2026 07:02:15 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.

Date : 10 September 2025 05:15 PM Views : 412

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా, బలంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వాస్థ్‌ నారీ – శ్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోస్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించుటకు గాను విస్తృత ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్య రక్షణలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల పరిధిలోని ప్రతి మహిళకు ఈ వైద్య శిబిరాల ద్వారా సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని ఆయన సూచించారు. మారిన జీవనశైలి, పర్యావరణ పరిస్థితులు కారణంగా మహిళలు అధికంగా బీపీ, షుగర్, హృద్రోగాలు, క్యాన్సర్, పిసిఒడి, రుతుక్రమణ సమస్యలు వంటి వ్యాధులకు గురవుతున్నారని, ఈ హెల్త్ క్యాంపుల ద్వారా రోగనిర్ధారణ జరిగితే వెంటనే తగిన చికిత్స, అవసరమైన మందులు అందించబడతాయని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య మహిళ, ఎన్‌సీడీ సెంటర్లు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయని వివరించారు. ప్రతి ఆయుష్ ఆరోగ్య మందిరంలో ఔషధ మొక్కలను వాటి పేర్లతో ప్రదర్శించి, మహిళలకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. యుక్త వయసు గల మహిళలకు అవగాహన కార్యక్రమాల లో భాగంగా, పిసిఒడి, నెలసరి సమస్యలు మరియు మహిళా ఆరోగ్యంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే, అక్టోబర్ 1న జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొనే పేద మహిళలు ఈ శిబిరాలను వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక హెల్త్ క్యాంపులు సమన్వయంతో నిర్వహించబడాలని ఆయన వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఏఎన్ఎంలు, చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మహిళకు ఈ ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా సమగ్ర ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, పోషకాహార ప్రాధాన్యం, జీవనశైలి సంబంధిత వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.మహిళల ఆరోగ్య పరిరక్షణ, శక్తివంతమైన కుటుంబ నిర్మాణం, సమాజ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్య చందన, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, డిసిహెచ్ఓ రవిబాబు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా,మున్సిపల్ కమిషనర్లు సుజాత, శ్రీకాంత్, వైద్యులు మరియు వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :