తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిర్యాదు ను స్వీకరించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రతివాదులకు నోటిసులు జారీ. ఈ నెల 29 వ తేదీన హజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం.రాజేందర్..కొత్తగూడెం :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పోస్టు ఆఫిస్ సెంటర్ నుండి కోర్టు, శేషగిరి నగర్ మిదుగా హేమచంద్రపూరం వేళ్లు రోడ్డు గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా మరమ్మతులకు గురైంది. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులకు దుమ్ము, ధూళి వల్ల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి టిప్పర్లు భారీ లోడ్ తో రాకపోకలు సాగించడం వల్ల రోడ్డులో భారీ గుంతలు ఏర్పడడంతో సామాన్య ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నయని, స్థానిక ప్రజలు సమస్య పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పాలకులు, సంబంధిత అధికారులు స్పందించడం లేదు అని, పాలకులు అధికారులు పూర్తిగా బాధ్యతరహిత్యంగా వ్యవహారిస్తున్నారని రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టే విధంగా బాధ్యులైన అధికారులకు ఆదేశాలు జారీ చేయలని సీనియర్ జర్నలిస్ట్ రెశ్వంత్ పండుగ ఫిర్యాదు చేశారు. ప్రతివాదులగా జిల్లా కలెక్టర్, కొత్తగూడెం శాసనసభ్యులు, సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, డివిజనల్ ఇంజనీర్ (రోడ్డు భవనాల శాఖ)లను చేర్చారు. ఈ మేరకు పి.యల్.సి. యస్. ఆర్. నెంబర్ 972/2025 గా కేసు నమోదు చేశారు. పై ప్రతివాదులను తేదీ 29/9/2025 ఉదయం 10:30 గంటలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుకు హజరు కావాలని నోటిసులు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ