తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. నమ్మకమైన సీనియర్ నాయకుడిని కోల్పోయాం.పొన్నబోయిన కుటుంబం పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయం.బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. సిపిఐ సీనియర్ నాయకులు పొన్నబోయిన వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటని, ఆయన మరణం అత్యంత బాధాకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మేదరబస్తీ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత పొన్నబోయిన వెంకటయ్య (65) ఇటీవల మృతిచెందగా, శనివారం ఆయన గృహాన్ని కూనంనేని సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దశాబ్దాలుగా పొన్నబోయిన కుటుంబం పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల వ్యాప్తికి అందిస్తున్న సేవలను కొనియాడారు. వెంకటయ్య లాంటి నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడం విచారకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి పార్టీ అన్ని విధాలా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్ బండి నర్సింహా, సిపిఐ నాయకులు, వెంకటయ్య కుమారుడు పొన్నబోయిన కుమార్, స్థానిక నాయకులు లింగయ్య, ఆరూరి వెంకటేశ్వర్లు తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ