తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చండ్రుగొండ మండల కేంద్రంలో చండ్రు గొండ గ్రామ పంచాయతీలో గ్రంధాలయ భవనాన్ని నిర్మించడానికి స్థానిక సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణీ, ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణ విన్నపం మేరకు గ్రంధాలయ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక శ్యాసన సభ్యులు జారే ఆదినారాయణ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పరిధి లోని ఇల్లు, స్థలం లేని పేద కుటుంబాలకు రెండు ఎకరాల భూమిని కేటాయించాలని MLA జారే ఆదినారాయణ కోరడం జరిగింది. చండ్రుగొండ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన చర్పంచ్ ఇస్లా వత్ రుక్మిణీ. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి సురేష్ జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్, నియోజక వర్గ సేవా దళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి, యూత్ కమిటీ ప్రెసిడెంట్ చిన్నం శెట్టి మహేష్ ,వార్డ్ మెంబర్ వసీం పాషా, మహిళా అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ