తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ కార్పొరేషన్ కార్యాలయం నందు కార్పొరేటర్స్ లింగం పుష్పావతి , చింతలపూడి శ్రావణి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . మరియు వేల్పుల భాస్కర్, కత్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు పాల్గొని ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే సమానత్వం సాధ్యమని , బడుగు ,బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహానుభావుడు అని ఆయన సేవలను కొనియాడుతూ , దేశ పురోగతికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఏకైక సాధనమని ఆయన అంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ మాజీ చైర్మన్ మండే వీర హనుమంతరావు , ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ పిచ్చి రెడ్డి ,సుజాతనగర్ తాహసిల్దార్ కృష్ణ ప్రసాద్, సుజాతనగర్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ అశోక్ చౌహాన్,స్థానిక నాయకులు చింతలపూడి. సాయి,బొడ్డు కేశవరావు ,కోటేష్ నాయక్, నరసింహారావు, రవీందర్, శ్రీనివాసరావు పలువురు అధికారులు , స్థానిక నాయకులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ