తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : “మన జనగణన – మన అభివృద్ధి” కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ద్వారా సేకరించే వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో సరైన ప్రణాళికలు రూపొందించడానికి ఖచ్చితమైన సమాచారం అవసరమని చెప్పారు.ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నిర్వహించబడే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో పాల్గొనేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని అన్నారు .పంచాయతీ శాఖ, మున్సిపల్ శాఖ, డిఆర్డిఓ, వ్యవసాయ శాఖ, వైద్యశాఖ, పంచాయతీరాజ్ తదితర అన్ని శాఖలు తమ పరిధిలోని ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఉద్యోగి తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడం ద్వారా సమగ్ర గణాంకాల సేకరణకు తోడ్పడాలని సూచించారు.జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సి పి ఓ సంజీవ రావు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ