తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో M.C.B.T ITI కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన Arrive-Alive అవగాహనా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్పీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి,ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive-2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం పాల్వంచ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో M.C.B.T ITI కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరు రోజుల పాటు రోడ్డు ప్రమాదాలను నియంత్రిండానికి ఏర్పాటు చేసిన Arrive-Alive campaign-2026లో భాగంగా సోమవారం నాడు విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్దినీ,విద్యార్థులు పాల్గొన్నారు.సుమారుగా 300 మంది విద్యార్థిని,విద్యార్థులు హాజరయ్యారు.ఎస్పీతో పాటు కొత్తగూడెం మున్సిపల్ కమీషనర్ సుజాత,ఆర్టీఓ వెంకటరమణ,స్థానిక కార్పొరేటర్ నూకల సరిత,మెడికల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్,NHAI JE మొహమ్మద్ అలీ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,పాల్వంచ సీఐ సతీష్,ఎస్సైలు నాగరాజు,జీవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి విద్యార్థులకు వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలను నియంత్రిచ్చవచ్చని అన్నారు.రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించే విధంగా సివిక్ సెన్స్ ను కలిగి ఉండాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు.విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ తమ తల్లీదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా నడుచుకుంటూ మంచిగా చదువుకుని క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని అకాక్షించారు.అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ