తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నవారైన ఇద్దరు పిల్లలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.సీనియర్ రిపోర్టర్ చంద్రగిరి అపర్ణ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆమె మరణం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని ఐలయ్య కాలనీ నివాసి అయిన అపర్ణ (32) తన ఇంట్లో బుధవారం ఉరివేసుకొని మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఆయన అపర్ణ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంతో భవిష్యత్తు ఉన్న జర్నలిస్ట్ అపర్ణ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. ఆమెకు తల్లితో పాటు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారని, వారు పూర్తిగా అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతంతమాత్రం జీవన పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. చిన్నవారైన ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాధికారులు వారిని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అపర్ణ మృతిపై విచారణ జరిపి అనుమానాలను నివృత్తిచేయాలని కోరారు. నివాళులర్పించిన వారిలో నాయకులు కొమారి హన్మంతరావు, మాచర్ల శ్రీనివాస్, సపావట్ రవి, ఉపేందర్, నాగమణి తదితరులు వున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ