Monday, 20 April 2026 01:57:12 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సీతారామ కెనాల్ పెండింగ్ భూసేకరణ వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 21 May 2025 09:08 PM Views : 470

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతారామ ఎత్తిపోతుల పథకం కెనాల్ భూ సేకరణ పై ఇరిగేషన్ మరియు సర్వే అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ కెనాల్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లోగా గ్రామసభలు నిర్వహణ పూర్తి చేయాలన్నారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందని అవగాహన కల్పించాలన్నారు. ఇరిగేషన్ అధికారులు సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేయర్లకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలు, లాప్టాప్ లు అందజేస్తామన్నారు. భూ సర్వే లో ఆధునిక పద్ధతులను అవలంబించి వేగవంతంగా భూ సర్వే పూర్తి చేయాలన్నారు. భూ సర్వే లో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడిక తీయు విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు పొలాల్లో ఉపయోగించుకునేందుకు మట్టిని తీసుకు వెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. చెరువులన్నిటిలో పూడిక తీయడం ద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు. అధికారులందరూ దీనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అన్ని చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. చెరువులు మరియు కాలువల వెంట సుబాబులు, తంగేడు తాటి చెట్లను విస్తృతంగా నాటే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వల వెంట పిల్ల కాలువల నిర్మాణం మరియు పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అవసరమైన సాండ్ బ్యాగులు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈలు అర్జున్ రావు, సురేష్ కుమార్ అశ్వరావుపేట, ఇల్లందు ఈఈ చారి, మరియు డి ఈ లు,సర్వేయర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :