తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం డివిజన్ సూపర్ వైజర్ లు మరియు MLHP నెలవారీ సమీక్షా సమావేశంలో Dr తుకారాం రాథోడ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పటిష్ఠంగా పనిచేయాలని గ్రామీణ ప్రజలలో ఆరోగ్యం పై అవగాహన కల్పించాలని వారికి అనారోగ్యం వారిన పడే అవకాశాలను తగ్గించాలని, ఆహారపు అలవాటు మార్చుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు , పండ్లు , కూరగాయలు, కార్బోహైడ్రేట్స్ , ప్రోటీన్స్, తృణ ధాన్యాలు, తీసుకోవాలని, జంతు సంబంధ ప్రోటీన్ల కంటే వృక్ష సంబంధమైన ప్రోటీన్లు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల వారిని పడకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలియజేశారు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ప్రతి నెల 12 రకాల ఆరోగ్య సేవలు మీద హెల్త్ ఆక్టివిటీస్ నిర్వహించాలని ప్రతి ఆక్టివిటీల్లో గ్రామ ప్రజలను సమీకరించి ఆరోగ్య విద్య బోధన చేయాలని, యోగ ఆసనాలు, నడక, జుంబా, సైక్లింగ్, ప్రాణాయామం , గర్భిణీలకు సాధారణ కాన్పు అయ్యే లాగా చిన్నచిన్న ఎక్సర్సైజులు చేపించడం ద్వారా అవ్వడం సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉందని సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించవచ్చు అని తెలియజేశారు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్న సిబ్బంది వారి లక్ష్యాలు చేరుకోవాలని వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, ఓకే మెడ నొప్పి మోకాళ్ళ నొప్పి దీర్ఘకాలిక రోగులకు వయోవృద్ధులకు, గర్భిణీలకు, అందరికీ కూడా ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల్లో నిర్వహించాలని తెలియజేశారు.పెయిన్ కిల్లర్ మందులు , డైక్లోఫెనాక్ ఇంజక్షన్లు వాడకుండా సాధారణ శారీరిక శ్రమ ఫిజియోథెరపీ ద్వారా నొప్పులను తగ్గించుకోవాలని తెలియజేశారు.కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు పాలియేటివ్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఇక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి డయాలసిస్ వారికి క్యాన్సర్ రోగులకు దీర్ఘకాలికంగా మంచంలో ఉన్న వారికి సేవలు అందిస్తారని తెలియజేశారు ఈ అవకాశాన్ని కొత్తగూడెం జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు.ఎండాకాలం దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాలని మధ్యాహ్న సమయంలో ఎండకు బయట తిరగకుండా జాగ్రత్త తీసుకోవాలని వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని సమృద్ధిగా నీరు తీసుకోవాలని, ORS పాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు ముందుగానే బర్త్ ప్లాన్ చేసి ఆ దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించాలని తెలియజేశారు , సూపర్వైజర్లు ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని ఆన్లైన్ డేటా ఎంట్రీ వివరాలు గూర్చి అవగాహన పెంచుకోవాలని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని గ్రామసభలలో ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలపై ఆరోగ్య విద్యా బోధన చేయాలని తెలియజేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చక్కగా పనిచేసే వారి అందుబాటులో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేట్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో కళాశాలలో విద్యార్థులకు ఆరోగ్య విద్య బోధన వ్యక్తిగత పరిశుభ్రత కౌమార దశలో పిల్లలకు వయసులో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు.జీవనశైలి వ్యాధుల గురించి అవగాహన పెంచుకొని మనం తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకొని ప్రశాంతమైన జీవనం గడిపినట్లయితే బీపీ , షుగర్ వ్యాధులను తగ్గించుకోవచ్చని తెలియజేశారు.గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నివారించే HPV వ్యాక్సిన్ 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు లోపు ఉన్న యుక్త వయసు బాలికలకు అందరికీ HPV వ్యాక్సిన్ వేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో Dr సాయి కళ్యాణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కొత్తగూడెం డాక్టర్ ప్రసాద్ డాక్టర్ ప్రతాప్ డాక్టర్ రామదాసు డాక్టర్ దినేష్ డాక్టర్ రాకేష్ డాక్టర్ హరీష్ ప్రోగ్రామ్స్ ఆఫీసర్స్ పాల్గొని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.అదే విధంగా జూలూరు పాడు ఆరోగ్య కేంద్రం కూడా సందర్శించి హెచ్ పి వి వాక్సిన్ గురించివివరించడంజరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ