తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం!! * భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్!! * ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మంగళవారం నాడు ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం లో ఏఐఎస్ఎఫ్ 90 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాడం జరిగింది. ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా హాజరయి శ్వేతా అరుణ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.... స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12 న అఖిల భారత విద్యార్ధి సమాఖ్య ఆవిర్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన - స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం
పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా - పోరాటాలే ప్రాణంగా - విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా "చదువుతూ పోరాడుతాం - చదువుకై పోరాడుతాం" అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, చేసిన ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఫహీమ్ అన్నారు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది. శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని, సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 89 వసంతాలు పూర్తిచేసుకుని 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై ఏఐఎస్ఎఫ్ గా పోరాడుతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ సంజయ్, నవిత, సోబిత, ప్రణయ్, వంశీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ