తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి, నారాయణ పురం,వినాయక పురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి. అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కల్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణా రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పాలించిన పెద్దోళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు.. కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు.. ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.. ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాము.అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయిన ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదు కనీసం ప్రతి పక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది అంటూ సెటైర్లు వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అటవీశాఖ అధికారులను భూ సర్వే విషయంలో రైతులతో అతి ఉత్సాహం చెయ్యద్దంటు చెప్పిన మంత్రి పొంగులేటి.
అనంతరం ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ పై పొంగులేటి ఫైర్.. పొంగులేటి అడిగిన ఏ ఒక్క విషయానికి సరైన జవాబు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో ఇళ్ళ పై వెళ్ళిన హైటెన్షన్ వైర్లను ఎటువంటి ఎస్టిమోషన్స్ ప్రజల పై వేయకండ డిపార్ట్మెంట్ నుండే క్లియర్ చేయాల్సిందిగా విద్యుత్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు వైద్యులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని, హాస్పటల్ ఆకస్మిక తనిఖీలు చేస్తామని అలసత్వం ప్రదర్శించిన వైద్యులు లేదా వైద్య సిబ్బంది పై కఠిన చర్యలుతీసుకుంటామని వైద్యశాఖ అధికారులను హెచ్చరించారు. విద్యాశాఖాధికారులతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా శక్తి రుణాలు అర్హులైన మహిళా సంఘాలను గుర్తించి స్థానిక శాసనసభ్యుల అనుమతితో మంజూరు చేయాలనిమంత్రి ఆదేశించారు. పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజ్,మువ్వా విజయ్ బాబు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ