Monday, 20 April 2026 01:33:59 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్

Date : 08 August 2025 07:36 PM Views : 424

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్ .. కొత్తగూడెం ఏరియాలోని కిష్టారం ఓసి, జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి, కొత్తగూడెం జిఎం కార్యాలయం నందు వివిధ విభాగాధిపతులతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్ సమీక్ష నిర్వహించారు. సింగరేణి నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కొత్తగూడెం ఏరియాను సందర్శించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు కొత్తగూడెం ఏరియా తరపున పూల మొక్క మరియు శాలువాతో ఘనంగా స్వాగతించారు. అనంతరం కిష్టారం ఓసీ అలాగే జేవిఆర్ఓసి ఉపరితల గనుల యొక్క మ్యాపుల ద్వారా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉపరితల గనుల యొక్క వివరాలను వివరించారు.ఈ సందర్భంగా జిఎం నూతనంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టు వికే ఓ.సి ఉపరితల మైన్ వివరాలను, వాటి యొక్క రికార్డులను వివరించారు.అనంతరం వారు కిష్టారం ఓసీ, జెవిఆర్ ఓ.సిలను సందర్శించి వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి,రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.ఎం శ్రీ. ఎం.షాలేం రాజుగారిని అడిగి తెలుసుకున్నారు. బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు నాణ్యత సామర్థ్యం ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు. అనంతరం కిష్టారం ఓసి & జేవిఆర్ ఓసిల నందు ప్లాంటేషన్ చేశారు.అనంతరం జెవిఆర్ సి.హెచ్.పి లోడింగ్ పాయింట్ ను సందర్శించి సి.హెచ్. పి నందు రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా గురించి, సైలో బంకర్ నుండి దుమ్ము ధూళి వెలువడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు బొగ్గు రవాణాను చేయాలని, బొగ్గు యొక్క గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరాచేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వారు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం సందర్శించారు ఈ సందర్భంగా వివిధ విభాగాల శాఖాధిపతులు, అధికారులు వారిని పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావం పనిచేసి, సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిఎం గారితో పాటు ఎస్ ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు జేవిఆర్ ఓసి ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ఎంవి. నరసింహారావు, జేవిఆర్ సి.హెచ్.పి డీజీఎం (ఈ&ఎం) కె. సోమశేఖర్, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్. యోహాన్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :