తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్ .. కొత్తగూడెం ఏరియాలోని కిష్టారం ఓసి, జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి, కొత్తగూడెం జిఎం కార్యాలయం నందు వివిధ విభాగాధిపతులతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్ సమీక్ష నిర్వహించారు. సింగరేణి నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కొత్తగూడెం ఏరియాను సందర్శించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు కొత్తగూడెం ఏరియా తరపున పూల మొక్క మరియు శాలువాతో ఘనంగా స్వాగతించారు. అనంతరం కిష్టారం ఓసీ అలాగే జేవిఆర్ఓసి ఉపరితల గనుల యొక్క మ్యాపుల ద్వారా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉపరితల గనుల యొక్క వివరాలను వివరించారు.ఈ సందర్భంగా జిఎం నూతనంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టు వికే ఓ.సి ఉపరితల మైన్ వివరాలను, వాటి యొక్క రికార్డులను వివరించారు.అనంతరం వారు కిష్టారం ఓసీ, జెవిఆర్ ఓ.సిలను సందర్శించి వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి,రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.ఎం శ్రీ. ఎం.షాలేం రాజుగారిని అడిగి తెలుసుకున్నారు. బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు నాణ్యత సామర్థ్యం ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు. అనంతరం కిష్టారం ఓసి & జేవిఆర్ ఓసిల నందు ప్లాంటేషన్ చేశారు.అనంతరం జెవిఆర్ సి.హెచ్.పి లోడింగ్ పాయింట్ ను సందర్శించి సి.హెచ్. పి నందు రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా గురించి, సైలో బంకర్ నుండి దుమ్ము ధూళి వెలువడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు బొగ్గు రవాణాను చేయాలని, బొగ్గు యొక్క గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరాచేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వారు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం సందర్శించారు ఈ సందర్భంగా వివిధ విభాగాల శాఖాధిపతులు, అధికారులు వారిని పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావం పనిచేసి, సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిఎం గారితో పాటు ఎస్ ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు జేవిఆర్ ఓసి ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ఎంవి. నరసింహారావు, జేవిఆర్ సి.హెచ్.పి డీజీఎం (ఈ&ఎం) కె. సోమశేఖర్, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్. యోహాన్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ