తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 30 తెలుగు వెలుగు)జూలూరుపాడు లో మార్కెట్ కోసం కేటాయించిన భూమి లో శాశ్వత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు చేయాలనీ పనులను వెంటనే ప్రారంభించలని కోరుతూ జూలూరుపాడు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు దమ్మపేట మండలం గండుగుల పల్లి లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి జూలూరు పాడు మండలానికి శాశ్వత మార్కెట్లను ఏర్పాటు చేయాలనీ కోరుతూ వినతి పత్రం అందిచడం జరిగింది. ఈ సందర్బంగా ఈ మండలం లో అత్యధికముగా పత్తి పంటను సాగుచేస్తున్నారు అని, అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి అమ్మాలి అంటే కొంత వ్యయ ప్రయాసలతో, ఖర్చు లతో కూడుకున్నాదని సమయం కూడా వేచించాల్సిన పరిస్థితి ఉన్నదని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేసారు.కాబట్టి అన్ని విధాలుగా రైతులకు ఉపయోగం గా అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ గా ఉన్నదని అన్నారు ఇక్కడికి వివిధ రాష్ట్రము లనుండి పత్తి కొనుగోలు చేయడం కోసం వ్యాపార వేత్తలు రావడంతో రైతులకు కూడా మేలు జరుగుతుంది అని మంత్రి గారికి కి వివరించటం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు భానోత్ ధర్మ, గుగులోత్ కేశవ నాయక్, లకావత్ నాగేశ్వరావు, భానోత్ మధు, భూక్యా శివ, భూక్యా శంకర్, గిరిజన ట్రేడర్ బానోత్ నాగేశ్వరావు హమాలీ మేస్త్రి లు గత్తం బాబురావు, జానూ, ఇల్లంగి సుందర్ రావు, పోతురాజు బోడయ్య, నరసింహారావు, వల్ల మల్ల చంద్రయ్య, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ