Friday, 19 June 2026 03:05:29 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

పాల్వంచ నవభారత్ "కాలనీ"లో భారీ చోరీ..!

Date : 26 January 2025 06:43 PM Views : 3733

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం , పాల్వంచ జనవరి 26 ( తెలుగు వెలుగు) పాల్వంచ మండలంలోని నవభారత్ కి చెందిన నవనగర్ కాలనీలోని క్వార్టర్స్ లో దొంగలు పడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన ఆదివారం జరిగింది. నవ నగర్ లోని క్వార్టర్స్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్, ప్రతాప్, అంజద్ పాషాల క్వాటర్స్ తో పాటు మరో ఏడు క్వార్టర్స్ లో దొంగలు చొరబడ్డారు. ఎన్బి-47 క్వార్టర్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్ ఇంట్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3.5 లక్షల నగదుని చోరులు అపహరించారు. క్వార్టర్స్ లోకి చొరబడ్డ దొంగలు ఆయా ఇళ్లల్లోని సామాగ్రిని, బట్టలను చిందరవందరగా పడవేసి హల్చల్ చేశారు. అదేవిధంగా బి-11 క్వార్టర్లో నివాసముంటున్న ప్రతాప్ ఇంట్లో సుమారు 61 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దోచుకు వెళ్లారు. బి-16 క్వార్టర్లోని అంజద్ పాషా ఇంట్లో సుమారు 8 తులాల బంగారం అపహరించు కెళ్ళారు. అదేవిధంగా మిగతా క్వార్టర్స్ లో కూడా చోరీ చోరీ జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ ఆయా యజమానులు ఇంకా నవ నగర్ కు చేరుకోలేదు. సరిగ్గా ఆ క్వార్టర్స్ లో నివాసముండే యజమానులు లేని సమయాన్ని అదునుగా చూసి దొంగలు చొరబడి దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కేవలం ఎంట్రన్స్ లో మాత్రమే రెండు సీసీ కెమెరాలు అమర్చారు. కాలనీలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, నిఘ వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగినట్లుగా అవగతం అవుతుంది. సమాచారం తెలుసుకున్న పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు సుమన్, రామారావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంని రంగంలోకి దించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఎంత మేరకు నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అనే విషయం తెలియాల్సి ఉంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :