తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన మనందరి లక్ష్యం కావాలి : కార్పొరేటర్ మునిగడప పద్మ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధన మనందరి లక్ష్యం కావాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. 16 డివిజన్ అంబేద్కర్ చమన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హిందువులకి భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ గ్రంధాలు ఎలాగో భారతీయులందరికీ భారత రాజ్యాంగం ఒక గ్రంథము లాంటిదని ఈ గ్రంథాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. కానీ నేడు భారతదేశ ప్రజలందరిని ఒకదాటిపైకి, చట్టానికి లోబడి పని చేసేటట్లుగా, పౌరులందర్నీ ఒక క్రమశిక్షణ మార్గంలో భారత రాజ్యాంగం నడిపిస్తుందని ఆమె అన్నారు.ఎక్కడైతే అవమానాలను ఎదుర్కొన్నారో అదే దేశంలో ప్రజలు ఆయన్ని నేటికీ కీర్తించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని ఆమె అన్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని 16 వ డివిజన్ పౌరులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పౌర నాయకులు సీనియర్ న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్స్ సరోజ, నీలవేణి, షహనాజ్ బేగం, హాజరయ్య ఈశ్వరయ్య, దుర్గయ్య ,తోగరు నరేందర్ ,దొంగ సత్యనారాయణ ,జుత్తుక దిలీప్ ,శనిగరపు నరేష్, పి ఎస్ ఎన్ మూర్తి, బట్టు శ్రీనివాస్ ,ఆల్లగొండ గోపి,రామ్ రాకేష్ ,వాసం బాబు ,తిట్ల దివాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ