Sunday, 19 April 2026 02:21:51 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వీరబాబు

Date : 17 July 2025 05:11 PM Views : 1016

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పసుపులేటి వీరబాబు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యకలాపాల ఇన్చార్జిగా, కొత్తగూడెం ములుగు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బాధ్యునిగా, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడినిగా పేరున్న ఆయనను గ్రంథాలయ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలకడం తో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వీరబాబుకు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులను పరిచయం చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను త్వరలో పరిశీలిస్తానని, ఆయా గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలతో సమానమని, అలాంటి దేవాలయాలను సంపూర్ణంగా తీర్చిదిద్ది ఉద్యోగులు సిబ్బంది సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు. అంతా కలిసిమెలిసి పని చేద్దామని, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి పాఠకులకు అనుకూలమైన వాతావరణాన్ని గ్రంథాలయాల్లో మరింతగా ఏర్పాటు చేద్దామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకులు జి. మణి మృదుల, నాగన్న, మధుబాబు అశ్వరావుపేట నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులు పల్లె వరప్రసాద్, లక్ష్మీదేవి పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జల్లారపు ఈశ్వర్, భద్రాద్రి బీసీ సంఘం ఉపాధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్, లక్ష్మీదేవి పల్లి మండలం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లావుడియా నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :