తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలు మెచ్చిన ప్రజామోదిత బడ్జెట్గా రూపొందించాలి,అభివృద్ధి అంటే రంగుల గ్రాఫిక్స్ కాదు మురికివాడల్లోని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే విధంగా గూడెం బడ్జెట్ ఉండాలి,పన్నుల వసూళ్లలో ఉన్నంత ఉత్సాహం ప్రజలకు సౌకర్యంలో కల్పించడంలో ఉండాలి. ప్రతి డివిజన్ కి సమాన బడ్జెట్ కల్పించాలి.మునిగడప పద్మ. ప్రజలు మెచ్చిన ప్రజా ఆమోదిత బడ్జెట్ గా కొత్తగూడెం కార్పొరేషన్ బడ్జెట్ను ఆమోదించాలని, ఇది అంకెల గారడి, ఊహాజనిత బడ్జెట్ గా ఉండకూడదని 16 వ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ మునిగడప పద్మ బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోమవారం కార్పొరేషన్ మీటింగ్ హాల్లో మేయర్ మూడు గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2026 2027గాను 14 71.49 లక్షల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశ చర్చల్లో కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ అభివృద్ధి అంటే రంగుల గ్రాఫిక్స్ కాదని, మురికివాడల్లోని ప్రజల జీవనం ప్రమాణ స్థాయిని పెంచడమే అభివృద్ధి అవుతుందని ఆమె సూచించారు. బడ్జెట్లోని అంశాలపై మాట్లాడుతూ 2025- 26 నాటికి రూ ..1640. 13 లక్షల ఆదాయాన్ని అంచనా వేసుకొని ది: 31 /1/2026 నాటికి 747.07 లక్షల ఆదాయం వచ్చినట్లు బడ్జెట్లో రూపొందించారని దీని ప్రకారం 893.06 రూ లక్షల రూపాయలు ఆస్తి పన్నులు, ఇతర వాటిపై మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని రాబట్టటంలో వైఫల్యం చెబుతున్నామని ఆమె అన్నారు. కార్పొరేషన్ వ్యాప్తంగా ఎన్ని అసెస్మెంట్స్ ఉన్నాయని అందులో కమర్షియల్, నాన్ కమర్షియల్ నుండి ఎంత ఆదాయం వస్తుందో సభ్యులకు వివరించాలని ఆమె సూచించారు . నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ లో నాలుగు గ్రామపంచాయతీలు విలీనమయ్యాయని గ్రామపంచాయతీలో పనులకు కార్పొరేషన్ పనులకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఆ వ్యత్యాసాన్ని ఈ బడ్జెట్లో చూపించారా తెలపాలని అన్నారు. 15వ ఫైనాన్స్ నుండి 2025- 26 నాటికి 770- 0 0 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని అంచనా వేసుకొని కేవలం 185. 35 లక్షల రూపాయల మాత్రమే రాబట్టగలిగామని మిగతా నిధులు ఎంత ఎందుకు రాబట్టలేకపోయామని సకాలంలో పనిచేయకన, లేక నిధులు లేకపోవడం కారణం చెప్పాలని ఆమె అధికారులను నిలదీశారు. అలాగే డి ఎం ఎఫ్ టి నిధులు 2025- 26 నాటికి 3100.00 రూ.. ఆదాయాన్ని అంచనా వేసుకొని కేవలం 11 51. 5 0 రూపాయలు మాత్రమే రాబట్టుకోగలిగామని అన్నారు. ఇంకా 1948. 50 రూ ..లక్షలు రావలసి ఉన్నదని ప్రశ్నించారు వాస్తవానికి బడ్జెట్ను పూర్తిగా పరిశీలిస్తే ది 31/1/ 2026 నాటికి 3448.73 రూ లక్షలు ఖర్చును దీంట్లో పొందుపరిచి 31/1/ 2026 నాటికి 2586. 03 లక్షల వాస్తవ ఆదాయాన్ని చూపారని దీన్ని బట్టి ఇంకా 862.70 లక్షల లోటు బడ్జెట్ కనిపిస్తుందని చివరికి మాత్రం 19 67. 80 మిగులు బడ్జెట్ గా చూపించారని దీన్ని బట్టి ఇది ఒక అంకల గారడి, ఊహాజనిత బడ్జెట్ గా ఉందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ కి ఇంటి పన్నులు, కమర్షియల్ టాక్సెస్, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై పన్నులు ద్వారా వచ్చే ఆదాయం మున్సిపల్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఉందని, డిఎంఎఫ్టి, ఫైనాన్స్ నిధులు రాకపోతే జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటుందని అన్నారు. కార్పొరేషన్ ప్రజలపై పన్నుల భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రభుత్వ ఖాళీ స్థలాలలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమర్షియల్ భవనాల నిర్మించి అద్దెల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని పద్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. 2026- 27 గాను 140 71. 49 లక్షల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టగా కార్పొరేషన్ అభివృద్ధికి దీనిపై వాడి వేడి చర్చ జరిగి సభ్యులు ఆమోదించారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ కార్పొరేషన్ లో ప్రధాన సమస్యలైన పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాల సమస్యల పట్ల అధికారులు అలసత్వాన్ని విడనాడి సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు . కార్పొరేషన్ వ్యాప్తంగా కోతులు, కుక్కలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, కోతులు కుక్కులను నివారించడంలో వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి కోతులు, కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని అధికారులను కోరారు. శానిటేషన్ మెరుగుపరిచేందుకు ఒక్కొక్క డివిజన్ కు కార్మికుల సంఖ్యను పెంచాలని, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ నిర్వహణ చేపట్టి పారిశుద్ధ్య మెరుగుపరచాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత తొమ్మిది సంవత్సరాల క్రితం 44 కోట్ల Dmft నిధుల తో కిన్నెరసాని పైప్ లైన్ల నిర్మాణం చేపట్టామని నేటికీ ఆ పైప్ లైన్ మార్గం ద్వారా ఒక్క చెంచాడు నీళ్లు కూడా ప్రజలకు ఇవ్వలేని దుస్థితి అధికారులు కల్పించాలని దీనిపై ఆలోచన చేయండి అని ఆమె కోరారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి కృషితో రూ.. 25 కోట్లు ముఖ్యమంత్రి ద్వారా అలాగే మిషన్ భగీరథ ద్వారా రూ ..125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, పనులు చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిన అధికారులు ప్రజలకు నీళ్లు అందించడంలో వైఫల్యం చెందుతున్నారని విమర్శించారు. అధికారుల వైఫల్యం కారణంగా ఇటు శాసనసభ్యులకు, అటు ప్రభుత్వానికి మీరు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె అధికారులను హెచ్చరించారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ,పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఎప్పుడు నీళ్లు అందిస్తారో చెప్పాలని ఆమె సభాముఖంగా అధికారులను నిలదీశారు. శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛభారత్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Admin
తెలుగు వెలుగు టీవీ