తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దమ్మపేట మండలంలోని పలు గ్రామపంచాయతీలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడం గ్రామ సభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు గ్రామస్థాయిలో పారదర్శకంగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ