తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.హాజరుకానున్న హరీష్ రావు, తెలంగాణ బొగ్గు పని కార్మిక సంఘం నాయకులు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి.ఈనెల 23న కొత్తగూడెం కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు ఉంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సదస్సులో ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారని, 15 నెలలుగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. అలాగే జులై, నవంబర్, మే లో జరిగిన అడ్వైస్డ్ రివ్యూ బోర్డు రిపోర్టును ఎందుకు విడుదల చేయలేదని అడిగారు. మారుపేరుల సమస్యకు పరిష్కారం చూపుతారా..? 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తారా లేదా..? రియంబర్స్మెంట్ ఉంటుందా లేదా అని పలు ప్రశ్నలు సంధించారు. 20 నుంచి 30 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తారా లేదా అని అడిగారు. ఈ అన్ని అంశాలపై ఈనెల 23న కొత్తగూడెం కమ్మ సేవాసమితిలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలియజేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, తాత మధుసూదన్, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హజారవుతారని చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ