Friday, 19 June 2026 09:04:36 PM
# బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి.

Date : 19 June 2026 07:21 PM Views : 20

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.హాజరుకానున్న హరీష్ రావు, తెలంగాణ బొగ్గు పని కార్మిక సంఘం నాయకులు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి.ఈనెల 23న కొత్తగూడెం కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు ఉంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సదస్సులో ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారని, 15 నెలలుగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. అలాగే జులై, నవంబర్, మే లో జరిగిన అడ్వైస్డ్ రివ్యూ బోర్డు రిపోర్టును ఎందుకు విడుదల చేయలేదని అడిగారు. మారుపేరుల సమస్యకు పరిష్కారం చూపుతారా..? 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తారా లేదా..? రియంబర్స్మెంట్ ఉంటుందా లేదా అని పలు ప్రశ్నలు సంధించారు. 20 నుంచి 30 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తారా లేదా అని అడిగారు. ఈ అన్ని అంశాలపై ఈనెల 23న కొత్తగూడెం కమ్మ సేవాసమితిలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలియజేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, తాత మధుసూదన్, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హజారవుతారని చెప్పారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: