తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జై భీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షులుగా కొత్తగూడెం పట్టణం గంగాబిషన్ బస్తీ కి చెందిన నాగుల రవికుమార్ ను మంగళవారం జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ నియమించారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ ఎవరైతే దెబ్బలు తింటారో వాళ్లే కేకలు వెయ్యాలని చెప్పిన మహాత్మ జ్యోతిబా ఫూలే వ్యాఖ్యలను బహుజనులు ఆదర్శంగా తీసుకొని,సమానత్వం కోసం,తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని పేర్కొన్నారు.అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్ మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ వ్యాప్తంగా పర్యటించి పట్టణ,మండల కమిటీల నిర్మాణం చేస్తానని,పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీ లు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కృషి చేస్తానని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్యపరిచి వారిని మమేకం చేసి ప్రజా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.బహుజనులు నూతన రాజకీయ శక్తిగా ఎదగాలన్నారు.అంబేద్కర్ గారి ఆలోచనా విధానమే బహుజనులకు రక్షణ అని తనపై నమ్మకంతో అసెంబ్లీ అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ కు,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ లకు మరియు తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు లకు ధన్యవాదాలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ