తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు లో కల్లూరు చెరుకు ఫ్యాక్టరీ వారు రైతులకు చెరుకు పంటపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున రఘునాథబాబు మాట్లాడుతూ చెరుకు టన్నుకు మద్దతు ధర 3200 రూపాయలు ఇస్తున్నాము, రైతులకు ఒక ఎకరానికి రెండు టన్నుల విత్తనం ఫ్రీగా ఇస్తున్నాము, చెరుకు నరుకుటకు కూలీలు కొరత వల్ల ఫ్యాక్టరీ వారు చెరుకు కటింగ్ యంత్రాలను ద్వారా కట్ చేసి ఫ్యాక్టరీకి తీసుకెళ్తాము, చెరుకు పంట ఒక ఎకరానికి 50 నుంచి 60 టన్నుల చెరుకు పంట పండుతుంది ఒక ఎకరానికి సుమారు ఒక లక్ష రూపాయల వరకు రైతుకు ఆదాయం వస్తుంది కావున రైతులు చెరుకు విస్తీర్ణం పెంచి ఆదాయం పొందగలరని రైతులను రఘునాథబాబు కోరినారు. ఈ సమావేశంలో షుగర్ ఫ్యాక్టరీ సిబ్బంది సీనియర్ కేన్ మేనేజర్ శాఖమూరి హరిబాబు, ఏవో ప్రభాకర్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ లు హరిబాబు, ఎం రాజేష్ మరియు రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ