తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రవాణా కష్టాల శాశ్వత పరిష్కారానికే సరికొత్త హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలు మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రధాన ధ్యేయం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే పిహెచ్సి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతర శ్రమ, మరిన్ని నిధుల సాధన సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఏ నిధుల ద్వారా పెద్దపీట వేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా చిట్టిరామవరం నుంచి చుంచుపల్లి రహదారిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, అలాగే కొత్తగూడెం బైపాస్ రోడ్డు నుంచి పెనుబల్లి (గరిమెళ్ళపాడు) ప్రధాన రోడ్డుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెనుబల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ బ్రిడ్జిల నిర్మాణంతో స్థానిక ప్రజల దశాబ్దాల రవాణా కష్టాలు తీరనున్నాయని, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా పెనుబల్లిలో అధునాతన ప్రాధమిక వైద్యశాల అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, అధికారులు ఎంపిడివో శుభాషిణి, తహసీల్దార్ నాగరాజు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మధుకర్, శ్రీకాంత్, నాగేంద్ర, స్థానిక నాయకులు వాసిరెడ్డి మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, భవాని, గోవిందు, సర్పంచి శాంతి శ్రీ, రెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ