Friday, 19 June 2026 09:09:23 PM
# బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 19 June 2026 07:15 PM Views : 124

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు.ఇల్లందు క్రాస్ రోడ్ నుండి బొమ్మనపల్లి క్రాస్ రోడ్ మధ్యన గల లోతు వాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (NH -930P) పైన గల బ్రిడ్జ్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్, బొమ్మనపల్లి క్రాస్ రోడ్, లోతు వాగు బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ మల్లింపు వల్ల స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, మల్లింపు పాయింట్ల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులతో పాటు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి సమయాలలో రిఫ్లెక్టివ్ జాకెట్స్ ధరించి ట్రాఫిక్ మళ్లింపు చేయాలని సూచించారు. పనులను వేగంగా పూర్తి అయ్యేలా చూస్తూనే, ట్రాఫిక్ జామ్ కాకుండా స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మరమ్మత్తులు పూర్తి అయ్యేంతవరకు అధికారులు అందరు సమన్వయంతో పనిచేస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల, రైల్వే అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: