తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మతిస్థిమితం లేని వ్యక్తిని అన్నం ఫౌండేషన్ వారికి అప్పగించిన సుజాతనగర్ పోలీస్. గత వారం రోజుల నుంచి సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో ఒక గుర్తు తెలియని 60 సంవత్సరాల వయస్సు గల మగ వ్యక్తి తెల్లటి మీసాలు,గడ్డం కలిగి ఉండి తెలుపు రంగు పైజామా మరియు ఆకుపచ్చని రంగు హాఫ్ ఫాంట్ వేసుకొని తిరుగుతూ కనిపించగా ఈ రోజు తేదీ 17.04.2026 న సుజాతనగర్ SI రమాదేవి తన సిబ్బంది తో అట్టి వ్యక్తిని వివరాలు అడగగా అతని పేరు తుమ్మ భాస్కరరావు గాను, అతనిది కోనాయిపాలెం గ్రామం నందిగామ మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి ప్రస్తుతం మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇట్టి వ్యక్తి గురించి నందిగామ దగ్గర ఉన్న కొనాయిపాలెం గ్రామంలో విచారించగా ఈ వ్యక్తి ఆ గ్రామానికి చెందినవాడు కాదని తెలిసింది. అనంతరం ఆ వ్యక్తిని సుజాతనగర్ SI పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి అతనికి కొత్త దుస్తులు కొనిపెట్టి అతని సంరక్షణ కోసం అతనిని ఖమ్మం కు చెందిన అన్నం ఫౌండేషన్ కి అప్పగించడం జరిగింది. ఇట్టి వ్యక్తి గురించి ఎవరికైనా ఏమైనా వివరాలు తెలిసినట్లయితే సుజాతనగర్ పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ