Sunday, 19 April 2026 05:58:07 PM
# మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , హౌసింగ్ పీడీ రవీందర్

Date : 04 August 2025 03:41 PM Views : 806

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , హౌసింగ్ పీడీ రవీందర్ నాథ్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... * ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు కొన్ని.* రామవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చిట్టి రామవరం తండా, 19వ డివిజన్లో నివసిస్తున్న గిరిజన లంబాడి పోడు రైతులు కొంతమంది సర్వే నెంబర్ 20 లో గల ఆర్వో ఎఫ్ ఆర్ అటవీ శాఖ పోడు భూములను గత 40 సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి పోడు నరికి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గతంలో మొత్తం 340 మంది పోడు రైతులు పట్టాల కొరకు దరఖాస్తు చేయగా, అందులో 97 మంది రైతులకు మాత్రమే పట్టాలు మంజూరు అయ్యాయని, కావున మిగిలిన వారికి పట్టాలు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం భద్రాచలం ఐటీడీఏ పీవో కు ఎండార్స్ చేశారు.చంద్రుగొండ మండలం వెంకట్య తండా పంచాయతీ పరిధిలోని కరశలబోడు తండా లో నివసిస్తున్న పోడు వ్యవసాయం చేస్తున్న రైతు ధారావత్ లక్ష్మి w/o బాలు తాము ప్రభుత్వ అనుమతితో బోరు వేసుకున్నామని, అట్టి బోరుకు విద్యుత్ కనెక్షన్ కొరకు 200 మీటర్లు ఉన్న ట్రాన్స్ఫారం నుండి తీసుకున్నటకు అనుమతించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం జయమ్మ కాలనీలో నివాసం ఉంటున్న పెనుగొండ రాజేశ్వరి w/o వీర కుమార్ భార్యాభర్తలు వివిధ కారణాల చేత విడిపోవడం జరిగిందని, రామానుజవరం గ్రామంలో సర్వేనెంబర్ 853 లో సుమారు 0.20 కుంటల భూమిని తనకు రాసి ఇవ్వడం జరిగిందని అట్టి భూమి మణుగూరు సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా భూసేకరణకు గురి అవుతున్నందువలన, తనకు రాసిచ్చిన భూమి నష్టపరిహారం తనకు ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఈ సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు. ఇల్లందు రెండవ నెంబర్ బస్తి లో నివాసం ఉంటున్న సిలువేరు చంద్రావతి తాను ఒంటరి మహిళలను అని తనకు వితంతు పింఛన్ మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కు పంపనైనది. చర్ల మండలం, చర్ల గ్రామంలో నివాసం ఉంటున్న భోగాల శివ తన తాతగారైన కొందమల్ల నరసింహారావు వాజేడు తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తూ చనిపోయారని, తన తాతగారి ఉద్యోగం తమ కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేనటువంటి వ్యక్తి తప్పుడు దృవపత్రాలు సృష్టించి జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారని, కావున పూర్తి విచారణ జరిపి న్యాయం చేకూర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ పరిపాలన అధికారికి ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :