తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , హౌసింగ్ పీడీ రవీందర్ నాథ్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... * ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు కొన్ని.* రామవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చిట్టి రామవరం తండా, 19వ డివిజన్లో నివసిస్తున్న గిరిజన లంబాడి పోడు రైతులు కొంతమంది సర్వే నెంబర్ 20 లో గల ఆర్వో ఎఫ్ ఆర్ అటవీ శాఖ పోడు భూములను గత 40 సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి పోడు నరికి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గతంలో మొత్తం 340 మంది పోడు రైతులు పట్టాల కొరకు దరఖాస్తు చేయగా, అందులో 97 మంది రైతులకు మాత్రమే పట్టాలు మంజూరు అయ్యాయని, కావున మిగిలిన వారికి పట్టాలు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం భద్రాచలం ఐటీడీఏ పీవో కు ఎండార్స్ చేశారు.చంద్రుగొండ మండలం వెంకట్య తండా పంచాయతీ పరిధిలోని కరశలబోడు తండా లో నివసిస్తున్న పోడు వ్యవసాయం చేస్తున్న రైతు ధారావత్ లక్ష్మి w/o బాలు తాము ప్రభుత్వ అనుమతితో బోరు వేసుకున్నామని, అట్టి బోరుకు విద్యుత్ కనెక్షన్ కొరకు 200 మీటర్లు ఉన్న ట్రాన్స్ఫారం నుండి తీసుకున్నటకు అనుమతించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం జయమ్మ కాలనీలో నివాసం ఉంటున్న పెనుగొండ రాజేశ్వరి w/o వీర కుమార్ భార్యాభర్తలు వివిధ కారణాల చేత విడిపోవడం జరిగిందని, రామానుజవరం గ్రామంలో సర్వేనెంబర్ 853 లో సుమారు 0.20 కుంటల భూమిని తనకు రాసి ఇవ్వడం జరిగిందని అట్టి భూమి మణుగూరు సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా భూసేకరణకు గురి అవుతున్నందువలన, తనకు రాసిచ్చిన భూమి నష్టపరిహారం తనకు ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఈ సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు. ఇల్లందు రెండవ నెంబర్ బస్తి లో నివాసం ఉంటున్న సిలువేరు చంద్రావతి తాను ఒంటరి మహిళలను అని తనకు వితంతు పింఛన్ మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కు పంపనైనది. చర్ల మండలం, చర్ల గ్రామంలో నివాసం ఉంటున్న భోగాల శివ తన తాతగారైన కొందమల్ల నరసింహారావు వాజేడు తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తూ చనిపోయారని, తన తాతగారి ఉద్యోగం తమ కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేనటువంటి వ్యక్తి తప్పుడు దృవపత్రాలు సృష్టించి జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారని, కావున పూర్తి విచారణ జరిపి న్యాయం చేకూర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ పరిపాలన అధికారికి ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ