తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, అధికారులను కోరారు. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. సెల్ఫీలు తీసుకోవడానికి పొంగుతున్న వాగుల వద్దకు వెళ్లవద్దని, ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ