తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి Dr తుకారాం రాథోడ్ , LT ఫార్మసీ ఆఫీసర్, నెలవారి సమీక్ష సమావేశంలో భాగంగా ఆలోచన మీటింగ్ హాల్ నందు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మన జీవితంలో భాగమైపోయిందని దాని వలన అనేక అనర్ధాలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ముఖ్యంగా అనేకమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు, ఆరపదార్ధాలు త్రాగునీరు వంటి వాటికి ప్లాస్టిక్ వాడకాన్ని ఉపయోగించకూడదని, మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ని దూరం పెట్టాలని, బయట ఆహార పదార్థాలను తినకూడదని , నూనెలు రీసైక్లింగ్ చేసి వాడుతున్నందువలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు, ప్రతిరోజు 5 లీటర్ల నీరు త్రాగాలని అలాగే శారీరక శ్రమ ఎక్సర్సైజులు , నడక మరియు యోగా చేయాలని తెలియజేశారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా ఏజెన్సీ జిల్లా అయినందువలన మన దగ్గరికి వచ్చే పేద రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని వారికి అవసరమైన మందులు ఇవ్వాలని , రక్తపరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు ఉద్యోగులు అందరూ సమయపాలన పాటించాలని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీలో ఉండాలని విధులలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించనని తెలియజేశారు , క్యాన్సర్ నివారణకు వేసే HPV వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అర్హులైన యుక్త వయసు బాలికలకు అందరకు HPV వ్యాక్సిన్ వేయించేలాగా ప్రోత్సహించాలని తెలియజేశారు. భద్రాద్రి జిల్లా లో ఆరోగ్య సూచికలలో ముందు ఉంచాలని అందుకు మీరందరూ బాధ్యతగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బంది ఆసుపత్రికి వచ్చే ప్రజలతో సత్ప్రవర్తనతో అభిమానంగా పలకరించాలని, ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించని, జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానలు , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందీర్ లలో ఆకస్మికతని తనికి చేస్తానని సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయపాలన పాటించకపోయినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు పాముకాటు , కుక్కకాటు మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. ఎండాకాలం దృశ్య వడ దెబ్బ తగలకుండా ప్రజలకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. సికిల్ సెల్ , తల సేమియా, HIV, వ్యాధిల పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. TB అనుమానిత వ్యక్తుల నుండి స్పుటం శాంపిల్ సేకరించాలని , BP, సుగర్ మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. IHIP పోర్టల్ లో ప్రగతి నివేదికలు ప్రతిరోజు ఆన్లైన్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , Dr సాయి కల్యాణ్ Dy DMHO కొత్తగూడెం, Dr రాందాస్ PO మలేరియా గారు, సొమ్లా CHO , రాంప్రసాద్ HEO, కుమార స్వామి AMO ,ఎల్టీలు మరియు ఫార్మసీ ఆఫీసర్స్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ