Sunday, 19 April 2026 02:12:56 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘం లో సభ్యురాలు గా ఉండాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

.

Date : 12 August 2025 08:01 PM Views : 392

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళల ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధనలో భాగంగా జిల్లాలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం క్రింద అర్హులైన మహిళలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు మరియు కిషోర బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలలో లేని అర్హులైన గ్రామీణ మహిళలను గుర్తించి, వారిని SERP ఆధ్వర్యంలో ఋణ సౌకర్యాలు, జీవనోపాధి అవకాశాలు, చిన్నతరహా వ్యాపారాల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలకు అనుసంధానించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా, గ్రామీణ సమాజంలో వారి స్థానాన్ని మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. అందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలతో 10–15 మంది సభ్యుల వృద్ధ స్వయం సహాయక సంఘాలు, దివ్యాంగులతో 5–15 మంది సభ్యుల ప్రత్యేక సంఘాలు, అలాగే 15–18 సంవత్సరాల వయస్సు గల కిషోర బాలికలతో 10–15 మంది సభ్యుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సంఘాల ద్వారా వారికి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాయం, శిక్షణ వంటి సదుపాయాలను అందించి, వారిని సమాజంలో మరింత చురుకుగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ స్థాయి సహాయక సిబ్బంది, సి సి లు, ఏం ఎస్ ఓబీ లు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్హురాలికి ఈ పథకం గురించి అవగాహన కల్పించడంతో పాటు, సంఘాలలో చేరడానికి అవసరమైన సదుపాయాలను అందించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో డి ఆర్ డి ఓ విద్యా చందన గ, అధనపు డి ఆర్ డి ఓ నీలేష్ , మహిళా శిశు సంక్షేమ అధికారి శ్ స్వర్ణలత లెనినా, LDM రామిరెడ్డి , అడల్ట్ ఎడ్యుకేషన్ డి డి అనిల్ , GM (GIC) , జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత , డీపీఎం లు, ఏపీఎం లు, సీసీ లు, ఏం ఎస్ ఓబీ లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :