తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 18(తెలుగు వెలుగు) ఖమ్మం జిల్లా ఎన్నారై ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భముగా జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10మంది నిరు పేద బాలికలకు 10 సైకిళ్లను డిస్టిక్ ఎన్నారై సెక్రటరీ రవి దేవిశెట్టి అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకమని పేదరికంతో బాధపడుతున్న బాలికల తలరాతలు మార్చేందుకు ఈ సంస్థ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొస్తాయని కొని ఆడారు. డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ పదో వార్షికోత్సవ సందర్భముగా పాఠశాలలోని ఉపాధ్యాయిని అయిన శ్రీమతి ఎస్ శాంత కుమారి కృషివలన పేద బాలికలకు సైకిళ్లుఇప్పించడం జరిగిందని వీరిని తోటి ఉద్యోగులు, ప్రధానోపాధ్యాయులు, బాలికల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రామశక్తి శ్రీనివాస్, నిమ్మగడ్డ ఉమా, ఎస్ శాంత కుమారి, కే లలిత, పి రామనాథం, జి వి ఆర్ ప్రసాద్, సునీత, శకుంతల, ఉమామహేశ్వరి, ప్రతాప్ రెడ్డి, ఉదయ్ మరియు బాలికల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ