Monday, 20 April 2026 03:56:58 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పాఠశాలలో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 20 April 2026 02:34 PM Views : 27

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం టేకులపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిస్థితులు, వంట తయారీ ప్రక్రియను తనిఖీ చేసి, విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్యం పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు . ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్, అది ఎప్పుడు ఏర్పాటు చేశారో, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు వినియోగంలో లేదో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు పాఠశాలలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా సమస్య ఉండటంతో ప్లాంట్‌ను ఉపయోగించలేకపోతున్నామని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తక్షణమే త్రీఫేస్ కరెంట్ సమస్యను పరిష్కరించి ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం టేకులపల్లి మండలం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి రోజువారీ శుభ్రత నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రమైన వాతావరణం అత్యంత అవసరమని , పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, సంబంధిత సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రత పనులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేసి, నిర్దేశిత మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు వండుతున్న ఆహార పదార్థాలను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. స్టోర్ రూమ్‌లో ఉంచిన కూరగాయలను పరిశీలించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కూరగాయలను నేలపై ఉంచడంపై వార్డెన్‌ను ప్రశ్నించి, వెంటనే ర్యాక్‌లు ఏర్పాటు చేసి శుభ్రంగా నిల్వ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తాసిల్దార్ వీరభద్రం, ప్రిన్సిపల్ రవీంద్ర, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :