తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 24 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం కాకర్ల పాలగుట్టపై కార్తీక మాసంలో విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్తీకమాస పూజా కార్యక్రమాల్లో భాగంగా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకునీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎత్తైన కొండపై నిర్మలమైన వాతావరణంలో గుడి ఆహ్లాదభరితంగా ఉందని స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గుడి విశిష్టతను గూర్చి పూజారి ఆరుట్ల లక్ష్మణచార్యుల ని అడిగి తెలుసుకున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ